కలం పవర్ న్యూస్ - ఆధ్యాత్మికం / జోగులాంబ గద్వాల్ : గద్వాల జిల్లా కేంద్రంలోని నల్లకుంట లో కైరున్నిస బేగం ఉర్డు ఘర్ కు వితరణ గావించిన నూతన భవనంలో ఆది వారం స్థానిక ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఉర్దూ, అరబిక విద్య, మదరసా, హజ్ యాత్రికుల శిక్షణ కేంద్రం మరియు ప్రార్థన బిల్లింగ్ ను రిబ్బన్ కటింగ్ చేసి ప్రారంభించారు. ఉర్దూ ఘర్ కమిటీ అధ్వర్యంలో ఎమ్మెల్యే కు శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు. అనంతరం ఉర్దూ, అరబిక విద్య, ప్రార్దన మందిరాన్ని పరిశీలించారు. ఉర్దూ, అరబిక విద్యార్థులకు తో కలిసి మాట్లాడి ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మైనార్టీ మత పెద్దలు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News