కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : మండల పరిధిలోని అయ్యవారిపల్లి గ్రామంలోని దుందుభి వాగు పరివాహక ప్రాంతంలో ఇసుక అను మతులను రద్దు చేయాలని మంగళవారం గ్రామానికి చెందిన పలువురు రైతులు ఇసుక టిప్పర్ లను అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన రైతులు నరసింహారెడ్డి, మల్లేష్, హరికృష్ణ, శ్రీకాంత్ తోపాటు పలువురు రైతులు మాట్లాడుతూ గతంలోప్రభుత్వఅవసరాల కోసం అయ్యవారిపల్లి లో ఇచ్చిన ఇసుక అనుమతులు రద్దు చేయాలని ధర్నాలు చేసిన ప్రస్తుత జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో ఇసుకను అడ్డుకుంటామని వాగ్దానాలు చేసిన ఎమ్మెల్యే ఇప్పుడు పట్టించుకోవడంలేదని వారు ఆరోపిస్తున్నారు. మిడ్జిల్ మండలంలో ఇసుక, మట్టి మాపియాను ఉక్కుపాదంతో ఆనచివేస్తామని గ్రామస్తుల సాక్షిగా అయ్యవారిపల్లి గ్రామ బొడ్రాయి పైన ప్రమాణం చేసి ఎన్నికలో ఓటు వేయించుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారని వారు అన్నారు గత వారం రోజులుగా ఇసుక రవాణా చేయొద్దని రైతులు వేడుకుంటున్నా లెక్క చేయకుండా మళ్ళీ టిప్పర్లను పంపించి రైతులను బెదిరిస్తునరాని అడ్డుకుంటే కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు దిగుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఇసుక అనుమతులను రద్దు చేయకుంటే నిరసనగా బుధవారం నుండి అయ్యవారిపల్లి గ్రామంలో ఆందోళన కార్యక్రమాలు చేయడం జరుగుతుందని వారు అన్నారు కావున మండలంలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు కార్యకర్తలు దుందుబి వాగు పరివాహక ప్రాంత రైతు సోదరులు హాజరయ్యి అయ్యావారిపల్లి గ్రామ రైతులకు అండగా నిలబడలని వారు కోరుతున్నారు.
Admin
Kalam Power News