కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : సిఎంఆర్ వడ్ల విషయంలో రాష్ట హై కోర్టు తీర్పు హర్షణీయని తెలంగాణ మానవ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట అధ్యక్షులు గోవింద్ శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. బుదవారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొంటూ సీఎంఆర్ (కష్టమ్ మిల్లింగ్ రైస్) విషయంలో కోర్టు తీర్పు మిల్లర్లకు బారి ఊరట నిచ్చిందనీ ఆయన పేర్కొన్నారు. మండల శాఖ అధికారులు, కలెక్టర్లు సీఎంఆర్ విషయంలో సకాలంలో చెల్లించని మిల్లర్ల ను బ్లాక్ లిస్టులో పెడతాం అనడం ఆస్తులను అటాచ్ చేస్తాం అనడం పై హైకోర్టు మిల్లర్లకు అనుకూలంగా తీర్పునివ్వడం సంతోష దాయకమని ఆయన పేర్కొన్నారు..రైతుల నుంచి సేకరించిన వడ్లను ఎలాంటి రుసుము లేకుండా రైస్ మిల్లర్లు నిల్వ చేశారని ఆయన అన్నారు.భారీగా సేకరించిన వడ్లను తాము కాపాడమని అన్నారు. ప్రభుత్వానికి చెల్లించే బియ్యాన్ని సకాలంలో అందిస్తామని ఆయన పేర్కొన్నారు.
Admin
Kalam Power News