Sunday, 26 April 2026 07:51:21 PM
# *“కలం–పాలన కలిసినపుడే సమాజానికి దిశ”* - జర్నలిస్టులు–రాజకీయ నాయకులు వేరు కాదన్న ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి # చాకచక్యంగా దొంగల పట్టివేత – మహబూబ్‌నగర్ రూరల్ పోలీసుల సక్సెస్ ఆపరేషన్...- రూ.1.40 లక్షల ఆస్తి స్వాధీనం… ఒకరు పరారీ # క్లాక్‌టవర్ వద్ద ట్రాఫిక్ కుప్పకూలింది… పోలీసులకు కనువిప్పు కలిగించే సంఘటన!..తక్షణ చర్యలు చేపట్టిన పోలీసులకు ప్రజల కృతజ్ఞతలు. # పాలమూరులో ‘గ్యారేజ్’ గూండాయిజం - కలం యోధులపై నిఘా నీడ_-_జర్నలిస్టుల ఇళ్లపై నిఘా… బైక్‌లపై వేట… వ్యక్తిగత దాడులకు కుట్ర! # కుర్చీల రాజకీయాలు… బడ్జెట్ కంటే ‘సీటు’కే సీన్!- నిబంధనలు మౌనం… వ్యాఖ్యానాలు గర్జనలు..బడ్జెట్ సమావేశం లొ కుర్చీల రగడ..!!. # “టెంట్‌కూ రాజకీయాలా.? పేదల నీడపై చిల్లర రాజకీయాలు ఆపండి!” భోజన కేంద్రం వద్ద టెంట్ వివాదంపై శ్రీనివాస్ గౌడ్ ఘాటు వ్యాఖ్యలు # “నీడపై కుడా రాజకీయాలేనా.? 5 రూపాయల భోజనంపై ‘టెంట్’ తగాదా.!” - కొత్త టెంట్‌కి 13 వేలు ఇచ్చి న రాజేందర్ రెడ్డి - అడ్డుకున్న మున్సిపాలిటీ సిబ్బంది..? # “కాంక్రీట్ జంగిల్‌లో కుక్కల రాజ్యం… కలెక్టర్ గారూ.. మాకు ఓటు హక్కు లేదు రక్షణ కుడా వుండదా....?! కుక్కల స్వైర విహారం… ప్రజల నిరాశ్రయం!” # “అంకెల గారడీ బడ్జెట్… సంక్షేమం మాయమైపోయింది!” - ఈ బడ్జెట్ అన్ని వర్గాలను నిరాశపరిచింది.! # “కుల సమీకరణాల కంటే సమన్యాయం ముఖ్యం… ఫ్లోర్ లీడర్‌గా బీసీ అయితే బీజేపీకి బలమా..?” # “బ్యానర్‌లపై కత్తెర… ప్రజాస్వామ్యంపై కక్ష..!! “బ్యానర్ భయం… అధికార అహంకారం బయటపడిందా.?” # ఖాకీ అండతో ‘ఇసుక సామ్రాజ్యం’..? భూత్పూర్‌లో సాండ్ మాఫియా అరాచకాలు ఫిర్యాదు చేసిన వారిపై బెదిరింపులు – పోలీసులపై ఆరోపణలు ... # ఇన్నాళ్లు కనబడని డొమెస్టిక్ సిలిండర్లు ఒక్కసారిగా ఎలా కనిపించాయి.!?మమూల్ల మత్తు దిగగానే తనిఖీల దుమారం! # “కాంగ్రెస్‌లో కొనసాగుతున్న కీచక పర్వం… రాజేందర్ రెడ్డి ఓటమికి ఇంటి వారే కారణమా.?” # “సారా మీద ఉన్న సోయి… సమాజం మీద లేదాయే..!” సారా మాటలేనా… సమాజ శ్రేయస్సు పట్టదా..?! # "గుంతలున్నా గంత సోయి లేదా..?”...గడియారం చౌరస్తా కాదు గుంతల చౌరస్తా..!...₹1200 కోట్ల నిధులు… కానీ రోడ్లపై గుంతలే గుంతలు నగర నడిబొడ్డున రోడ్ల దుస్థితి. # అధికారులకు పట్టింపు లేదు.. పాలమూరు నేతలకు సోయి లేదు..? - స్థానిక యువతకు తక్కువ వేతనాలు, బయటి ప్రాంతాల వారికి అధిక వేతనాలు..! # ఎయిడ్స్‌పై అవగాహనకు పోస్టర్ మేళా విద్యార్థుల సృజనాత్మక ప్రదర్శనలు – ఆరోగ్య చైతన్యానికి విద్యా వైద్యశాఖ సంయుక్త చర్య # మాదిగ ఉద్యోగుల ఐక్యతకు ప్రతీక… మాదిగ ఎంప్లాయిస్‌కు శుభాకాంక్షలు తెలిపి పచ్చ జెండాతో బస్సు ప్రారంభించిన వినోద్ కుమార్ # కుర్చీకి వినతిపత్రం… ఎంఈఓ ఎక్కడ..? అనుమతుల్లేని పాఠశాలలపై చర్యలు లేక విద్యార్థి సంఘాల ఆగ్రహం..

కల్వకుర్తికి పాకిన ధాన్యం దొంగతనం -14 వేల ధాన్యం బస్తాలు చోరీ.! -చోరీపై నిగ్గు తేలేనా..?

Date : 05 April 2024 06:24 AM Views : 946

కలం పవర్ న్యూస్ - తెలంగాణ / కల్వకుర్తి : కాదేదీ చోరీకి అనర్హం అనే విధంగా వ్యవహారం నడుస్తోంది వ్యాపారులు నిల్వ ఉంచుకున్న ధాన్యాన్ని చోరీ చేశారంటే పక్కా ప్రణాళికతో నే అని పలువురు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వం సీఎంఆర్ లో భాగంగా రైస్ మిల్లు వ్యాపారులకు ధాన్యాన్ని కేటాయించింది ధాన్యం పెద్ద ఎత్తున రావడంతో వ్యాపారులు తమ మిల్లులో స్థలం సరిపోక ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ గోదాములలో నిలువ చేసుకున్నారు కల్వకుర్తికు చెందిన సద్గురు రాఘవేంద్ర పారా బాయిల్డ్ మిల్లు యజమానికి ప్రభుత్వం సీఎంఆర్ లో భాగంగా జిల్లాలో అధికంగా ధాన్యం రావటం వల్ల ప్రభుత్వం మిల్లు గోదాం సామర్థ్యం నకు మించి అధిక ధాన్యం ఇవ్వటంతో వ్యాపారి రమేష్ బాబు వెల్దండ మండలం పెద్దాపూర్ ప్రభుత్వ వ్యవసాయ మార్కెట్ గోదాంలో నిల్వచేశారు అయితే గోదాం అద్దె చెల్లించలేదని మార్కెట్ అధికారులు వ్యాపారికి నోటీసులు జారీ చేసి గోదామును సీజ్ చేశారు, సీఎంఆర్ ధాన్యం నిల్వ ఉంచిన ప్రభుత్వం గోదాములకు అద్దె చెల్లించాల్సిన అవసరం లేదని వ్యాపారులు చెప్పిన మార్కెటింగ్ శాఖ అధికారులు జీవో కాఫీ చూపించాలని వితండవాదం చేసి సంవత్సర కాలంగా గోదాం తాళం చెవిలను తమ వద్ద ఉంచుకున్నారు అయితే ఇటీవల వనపర్తి జిల్లా చిన్నంబావి గ్రామంలో ధాన్యం చోరిలో నిందితుడు పట్టుబడ్డాడు ఆ సంఘటన మరువకముందే జిల్లాలోని బలుమూరు, కోడేరు గ్రామాలలో ఉన్న గోదాములలో ధాన్యం చోరీ జరిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఈ సంఘటన సంచలనం సృష్టించింది, అయితే కల్వకుర్తిలో మరోసారి ధాన్యం చోరి సంఘటన వెలుగు చూడడంతో అందరూ అవాక్కయ్యారు, మిల్లర్ల వ్యవహారం కనిపెట్టిన వారే ఈ దొంగతనాలు చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి దొంగతనానికి పాల్పడిన వారికి ఎవరైనా వెనక నుండి సహాయ సహకారాలు అందించారా అని అనుమానాల సైతం వెల్లువెత్తుతున్నాయి కోటి రూపాయలకు పైగా విలువ చేసే ధాన్యాన్ని ఎత్తుకెళ్లారంటే పకడ్బందీ ప్రణాళిక ప్రకారమే చేసి ఉంటారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, ప్రధాన రహదారి పక్కనే ఉన్న గోదాంలో లారీల ద్వారా లేదా ఇతర వాహనాల ద్వారా అయితేనేం ఇంత పెద్ద ఎత్తున చోరీ జరిగే అవకాశం ఉంటుందని పలువురు చెబుతున్నారు, చిన్నంబావిలో చోరీ చేసిన ముఠాతో పాటు మరికొందరిని ఆరా తీస్తే అసలు విషయం వేలుగులోకి వస్తుందని పలువురు అంటున్నారు, సంవత్సర కాలంగా గోదాం తాళాలు ఇవ్వకుండా వ్యవహారం కొనసాగడం వల్లే సమస్య వచ్చిందని వ్యాపారి అంటున్నారు మార్కెట్ అధికారులు వివక్షపూరితంగా వర్ణిస్తూ కిరాయి చెల్లించని వారిని కొందరిని పట్టించుకోకుండా మరికొందరిని ఇబ్బందులు పెడుతూ కొత్త సమస్యకు తెర తీశారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి, ధాన్యం చోరీ చేసే ముఠా దర్జాగా వేల సంఖ్యలో ధాన్యం బస్తాలను ఎత్తుకెళ్లి కోట్ల రూపాయల నష్టం చేస్తుండటంపై అనేక సమస్యలు వస్తున్నాయి, బుధవారం పెద్దాపూర్ గ్రామంలోని గోదామును మార్కెటింగ్ అధికారులు తాళాలు, తీసి రమేశ్ బాబు ను పిలిపించారు దీంతో చోరీ సంఘటన వెలుగు వచ్చింది. *చోరీపై విచారణ చేయాలి* వెల్దండ మండలం పెద్దాపూర్ మార్కెటింగ్ శాఖ గోదాంలో రాఘవేంద్ర ఫారాబాయిల్డ్ మిల్లు కు చెందిన దాదాపు 15 వేల బస్తాల ధాన్యం చోరీ అయిందని చోరీకి పాల్పడిన సంఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను శిక్షించడంతోపాటు తనకు న్యాయం చేయాలని సద్గురు రాఘవేంద్ర పారాబైల్డ్ మిల్లు యజమాని జూలూరు రమేష్ బాబు కోరారు జిల్లాలోని ఇతర ప్రాంతాలలో జరిగిన చోరీకి ఇక్కడికి ఏమైనా సంబంధం ఉందా అనే అంశంపై దృష్టి సారించాలని చోరీ సంఘటనపై పోలీసులకు సివిల్ సప్లై అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రమేష్ బాబు తెలిపారు.

Sunder Chary

Admin

Kalam Power News

మరిన్ని వార్తలు

Copyright © Kalam Power News 2026. All right Reserved.



Developed By :