కలం పవర్ న్యూస్ - తెలంగాణ / జోగులాంబ గద్వాల్ : మహాత్మ జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా గద్వాల జిల్లా కేంద్రంలోని క్రిష్ణవేణి చౌరస్తా నందు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహానికి గద్వాల పట్టణ తెలుగు ముదిరాజ్ సంఘం టౌన్ అధ్యక్షుడు వంట భాస్కర్ ఆధ్వర్యంలో కలిసి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.అనంతరం తెలుగు ముదిరాజు టౌన్ అధ్యక్షుడు వంట భాస్కర్ మాట్లాడుతూ జాతి వివక్ష లేని సమసమాజ స్థాపన కోసం జీవితం మొత్తాన్ని అంకితం చేసిన మహానుభావుడు మహాత్మా జ్యోతి రావు పూలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగు ముదిరాజ్ సంఘం సభ్యులు జిల్లా యూత్ ప్రెసిడెంట్ పాండు, వంట భాస్కర్ టౌన్ అధ్యక్షుడు, టి ఎన్ అర్ జగదీష్ తాలూకా తెలుగు ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు, తెలుగు ముదిరాజ్ జిల్లా సెక్రెటరీ కొత్తపల్లి ఆంజనేయులు (అంజి), జిల్లా తెలుగు ముదిరాజు గౌరవ సలహాదారులు (రాంబో )లక్ష్మన్న, చేపల దౌలన్న, విష్ణు ప్రియ హోటల్ కౌన్సిలర్ దౌలు, టి శ్రీను కౌన్సిలర్, గోవింద్, టౌన్ ఉపాధ్యక్షుడు మధు చెన్నకేశవ మత్స్యకారుల సంఘం అధ్యక్షుడు వెంకట్ రాములు, డల్ట్లేటి నరసింహ టౌన్ ప్రధాన కార్యదర్శి, సుంకులమ్మ మెట్టు కృష్ణ , టి ఆర్ కృష్ణ, కేకే వెంకటన్న జిల్లా సంఘం నాయకులు, తెలుగు ముదిరాజ్ జిల్లా అధ్యక్షులు కబీర్దాస్ నర్సింలు, జిల్లా జాయింట్ సెక్రెటరీ నెంబర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.
Admin
Kalam Power News